అనగనగా ఒక రోజు, ఒకే సంఘటన ప్రపంచంలోని వేర్వేరు ప్రదేశాల్లో జరిగింది…
మొట్టమొదట ఇంగ్లాండ్ లో… ఒక యాపిల్ చెట్టు కింద ఒకాయన కూర్చున్నాడు. పైనుంచి ఒక యాపిల్ పండు దబ్బుమని నేల మీద పడింది.అది బావుందో, లేదో చూస్కొని తినక, అదెందుకు కింద పడింది, పైకెందుకు పోలేదు అని పిచ్చి పిచ్చిగా ఆలోచించి. రీసెర్చీ గట్రా చేసి, భూమికి అదేదో శక్తి వుందని కనిపెట్టాడు… ఇంత వరకు చాలా బావుంది.
అదే రోజు అమెరికాలో కూడా ఒక పండు పడింది… అది యాపిలో మరేదో ప్రస్తుతానికి మనకనవసరం. వెంటనే అది చూసిన ఒకడు, మరో పది రోజులు అబ్జర్వ్ చేసి, ఎన్ని పళ్ళు పడుతున్నాయి, వాటి యావరేజ్ ఏంటి, వాటి క్వాంటిటి ఎంత అనే లెఖ్ఖలు వేసి, ఇన్ని చెట్లు ఇంత కాలం పెంచితే, ఇన్ని పళ్ళు పడతాయి కాబట్టి, ఇంత పన్ను కట్టించుకోవచ్చని ప్రూవ్ చేసి, బిల్లు పెట్టి రాజ్యాంగాన్నే సవరించాడు.
అలాగే అంటార్క్ టికా లో కూడా ఒక పండు పడింది. చెట్లే లేని ప్రదేశంలో పండు పడేసరికి, అదేదో చెత్త అని కనీసం దాన్ని చూడకుండా, పక్కన పడేసాడు అక్కడే పనిచేస్తున్న ఒక సైంటిస్ట్. పాపం ఆయన తప్పేం లేదులెండి. ఆయనేదో ప్రశాంతంగా ఏవో కొన్ని పరిశోధనలు చేసుకుందామని వస్తే, అక్కడా ఈ ప్లాస్టిక్ కాలుష్యం ఎదురయ్యింది. అందుకే ఆయనలో చిరాకు పెరిగింది… అంతే.
అఫ్ఘనిస్తాన్ లో పండు పడితే, పడ్డ ప్రతీ పండుకూ ఒక బాంబు చొప్పున అమెరికాలో పేల్చాలని తీర్మానించారు. ప్రస్తుతం మానవ బాంబుల తయారీలో వాళ్ళు చాలా బిజీ…
పాకిస్తాన్ లో అయితే, పండు పడ్డా బాంబేమోనని జడిసి పెరిగెత్తారు.
ఆస్ట్రేలియాలో పడ్డప్పుడు. అది అక్కడి చెట్టుదా లేక ఆ చెట్టు మూలాలు ఇండియాలో వున్నయా అని చూసి, అవి ఇక్కడివని తెలిస్తే, ఆ చెట్టుని కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి, చివరికి పెట్రోలు పోసి తగులబెడుతున్నారు.
ఆఫ్రికాలో అయితే, చచ్చిపోయిన కాకి పైనుంచి పడితే, అదేంటో కూడా చూడకుండా పండు అనుకొని క్షణాల్లో తినేశారు…
ఇలా వివిధ దేశాల్లో… ప్రదేశాల్లో ఒక్కొక్కటి చొప్పున పళ్ళు పడ్డాయి.
కానీ భారత దేశం వేద భూమి కావడం చేత…
ప్రక్రుతి పులకించి ఒకే సారి, 28 రాస్ట్రాల్లో 28 పళ్ళు పడ్డాయి…
అంతలో అందులో కొన్ని పళ్ళు మావని చైనా, కొంత మాదని పాకిస్తానూ గొడవ చెయ్యడంతో, ఇండియా బుద్దిగా ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది… నా దేశంలో పడే పళ్ళు నావే అని మీరు చెప్పండి అని అంది. పిల్లీ, పిల్లీ, గొడవపడి, కోతిని అడిగినట్టు… ఆ గొడవ తీరలేదు,
ఇంతలో ఒక చోట, పడ్డ పండు హరిజనులది కాబట్టి, హరిజనులంతా నా పుట్టిన రోజు నాడు ఈ పళ్ళనే సమర్పించుకోవాలి అని ఒకరి ఆజ్ఞ.
ఇంకో చోట ఏ పండు పడ్డా దాన్ని మా భాషలోనే పిలవాలి, లేకపొతే, అసలు ఆ పండునే పండనివ్వం అని గొడవ.
ఇక పోతే అన్నపూర్ణ.. వేరే చొట్ల లాగా ఇక్కడ పండు పడితే ఎవరికీ ఏం ఇబ్బంది లేదు… అసలు పడడానికి ఆ పండే ఒక సారి అలోచించుకోవాలి. ఎందుకంతెద.. ఎప్పుడు వరదలొస్తాయో, ఎప్పుడు కరువొస్తుందో తెలీదు. ఏ ప్రాంతంలో పడితే, ఏ ప్రాంతం వారు కొత్తుకుంటారో తెలీదు. ఒక పండు పడటం చూస్తే, మొత్తం పిందెలతో సహా ఎక్కడికి తరలిస్తారో తెలీదు… ఇన్ని సమస్యల మధ్య… ఎప్పట్లాగే ఆ పళ్ల చెట్టు వేరే రాస్ట్రాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించాలి…